Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు కోల్పోయి 57,276కి పడిపోయింది. నిఫ్టీ 167 పాయింట్లు నష్టపోయి 17,110కి దిగజారింది.

ఈ క్రమంలో బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆటో, ఫైనాన్స్ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి. వడ్డీ రేట్లను పెంచుతామంటూ అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.81%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.75%), మారుతి సుజుకి (2.52%), కోటక్ బ్యాంక్ (2.02%), సన్ ఫార్మా (0.64%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-4.17%), టెక్ మహీంద్రా (-3.66%), డాక్టర్ రెడ్డీస్ (-3.42%), విప్రో (-3.22%), టీసీఎస్ (-3.18%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News