sensex: భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

  • 554 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 195 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా నష్టపోయిన మారుతి సుజుకి షేరు విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. చివరి గంటలో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి 60,754కి పడిపోయింది. నిఫ్టీ 195 పాయింట్లు కోల్పోయి 18,113కి దిగజారింది. బ్యాంకింగ్ సూచీ మినహా ఇతర అన్ని సూచీలు ఈరోజు నష్టపోయాయి. ఈరోజు 1,007 షేర్లు అడ్వాన్స్ కాగా, 2,218 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 59 షేర్లు ఎలాంటి మార్పుకు గురి కాలేదు.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (1.87%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.48%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.39%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.34%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.25%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-4.05%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.84%), టెక్ మహీంద్రా (-3.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.09%), టాటా స్టీల్ (-2.86%).

More Telugu News