Sensex: భోగి రోజున స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఐదు రోజుల లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

అసలు ఈ రోజు ఉదయం భారీ నష్టాలతో మార్కెట్లు మొదలయ్యాయి. అయితే, మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు జరగడంతో మార్కెట్లు పుంజుకుని, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ కేవలం 12 పాయింట్లు మాత్రమే నష్టపోయి 61,223కి పడింది. నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 18,255 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.84%), ఇన్ఫోసిస్ (1.64%), ఎల్ అండ్ టీ (1.32%), టెక్ మహీంద్రా (1.18%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.11%).

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.66%), యాక్సిస్ బ్యాంక్ (-2.54%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.61%), విప్రో (-1.55%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News