Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
  • 651 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 191 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.12 శాతం లాభపడ్డి టైటాన్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే పయనించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 651 పాయింట్లు లాభపడి 60,396కి చేరుకుంది. నిఫ్టీ 191 పాయింట్లు పెరిగి 18,003కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (3.12%), మారుతి సుజుకి (2.50%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.49%), ఎల్ అండ్ టీ (2.46%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.39%).

టాప్ లూజర్స్:
విప్రో (-2.47%), నెస్లే ఇండియా (-1.17%), ఏసియన్ పెయింట్ (-0.55%), సన్ ఫార్మా (-0.46%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.41%).
Sensex
Nifty
Stock Market

More Telugu News