ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
- త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
- ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో పోలింగ్
- యూపీలో ఏడు దశల్లోనూ పోలింగ్
- పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు
- మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్
403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయి. మణిపూర్ లో ఫిబ్రవరి 23, మార్చి 3వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ ఉంటుంది. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఓట్లను లెక్కించనున్నారు.
కాగా, తొలిదశ ఎన్నికల కోసం జనవరి 14న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 21. జనవరి 24న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జనవరి 27. ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది.