Sensex: నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. కోలుకున్న మార్కెట్లు!

Markets ends in profits
  • 113 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 27 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.61 శాతం లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ
వరుసగా నాలుగు సెషన్ల పాటు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ తీసుకున్న సానుకూల నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 113 పాయింట్లు లాభపడి 27,901కి పెరిగింది. నిఫ్టీ 27 పాయింట్లు పుంజుకుని 17,248 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.61%), ఇన్ఫోసిస్ (2.19%), టైటాన్ కంపెనీ (1.52%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.35%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.11%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-1.51%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.50%), బజాజ్ ఆటో (-1.44%), సన్ ఫార్మా (-1.43%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.94%).
Sensex
Nifty
Stock Market

More Telugu News