Sensex: నాలుగు రోజుల నష్టాల తర్వాత లాభాలలో మార్కెట్లు

Markets ends in profits
  • 145 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 11 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 11.65 శాతం పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల నష్టాల తర్వాత ఈ రోజు లాభాలు దండుకున్నాయి. బ్యాంకింగ్ స్టాకుల అండతో మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 60,967కి చేరుకుంది. నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 18,125 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (11.65%), యాక్సిస్ బ్యాంక్ (3.56%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.90%), టెక్ మహీంద్రా (0.72%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-3.19%), బజాజ్ ఆటో (-2.73%), మారుతి సుజుకి (-2.37%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.13%), ఏసియన్ పెయింట్స్ (-2.02%).
Sensex
Nifty
Stock Market

More Telugu News