Sensex: వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses for second straight day
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాకులు మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి. మధ్యాహ్నం వరకు దాదాపు 556 పాయింట్ల వరకు సెన్సెక్స్ నష్టపోయింది. అయితే ఆ తర్వాత పవర్, మెటల్, ఫార్మా స్టాకులకు కొంతమేర కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు కొంతవరకు కోలుకున్నాయి.

ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 254 పాయింట్లు నష్టపోయి 59,413కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు పతనమై 17,711 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (6.18%), సన్ ఫార్మా (4.09%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.37%), టైటాన్ కంపెనీ (1.23%), టాటా స్టీల్ (1.16%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.96%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.75%), ఏసియన్ పెయింట్స్ (-1.72%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.63%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.45%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News