Sensex: దూసుకుపోయిన మార్కెట్లు... 958 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

  • ఒకానొక సమయంలో 1,030 పాయింట్ల వరకు లాభపడ్డ సెన్సెక్స్
  • 276 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ వాల్యూ
Sensex closes 958 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు సెన్సెక్స్ ఒకానొక సమయంలో 1,030 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్ షేర్లు ఈ రోజు అద్భుతమైన ప్రదర్శనను కనపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 958 పాయింట్లు లాభపడి 59,885కి పెరిగింది. నిఫ్టీ 276 పాయింట్లు ఎగబాకి 17,823కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (5.15%) ఎల్ అండ్ టీ (3.46%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.11%), యాక్సిస్ బ్యాంక్ (3.04%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.46%).

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.09%), ఐటీసీ (-0.41%), నెస్లే ఇండియా (-0.38%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.11%), భారతి ఎయిర్ టెల్ (-0.08%).

More Telugu News