Venkatesh Daggubati: ఈ నెల 20న 'దృశ్యం 2' ఫస్టులుక్ రిలీజ్!

  • నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'దృశ్యం 2'
  • ప్రధాన పాత్రల్లో వెంకటేశ్ - మీనా
  • 20వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు ఫస్టులుక్  
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
Drushyam 2 movie update

మలయాళంలో వచ్చిన 'దృశ్యం' అక్కడ కొత్త రికార్డులకు తెరతీసింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఎన్ని భాషల్లో రీమేక్ అయిందో ... అన్ని భాషల్లోను విజయాన్ని సొంతం చేసుకుంది. అలా తెలుగులోనూ ఈ కథకు భారీ సక్సెస్ దక్కింది. ఇక ఈ మధ్య మలయాళంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ కి అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో తెలుగులోనూ ఈ సీక్వెల్ కి రీమేక్ చేశారు.

వెంకటేశ్ - మీనా నటించిన ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అలాగే మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.      

More Telugu News