CBI: కాసేపట్లో సీబీఐ డైరెక్ట‌ర్‌ను క‌ల‌వ‌నున్న రేవంత్ రెడ్డి

  • టాలీవుడ్ లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం
  • ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ
  • టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై రేవంత్‌ తీవ్ర ఆరోప‌ణ‌లు
  • డ్ర‌గ్స్ స‌హా ప‌లు అంశాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని విన‌తి
revant to meet cbi director

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కాసేప‌ట్లో సీబీఐ డైరెక్ట‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు. టాలీవుడ్ లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తీవ్ర‌ చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుండ‌డంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ జ‌రుపుతోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోన్న‌ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) డైరెక్ట‌ర్‌ను క‌ల‌వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

డ్ర‌గ్స్ స‌హా ప‌లు అంశాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న సీబీఐని కోర‌నున్నారు. కాగా, డ్రగ్స్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమగ్రంగా విచారణ చేపట్టలేదని ఆయ‌న మొద‌టి నుంచి ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ప్ర‌మేయం ఉందంటూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంద‌ని చెబుతున్నారు.

More Telugu News