Pakistan: కోపంతో రిబ్బ‌న్‌ను ప‌ళ్ల‌తో కొరికి క‌ట్ చేసి పారేసిన మంత్రి.. వీడియో వైర‌ల్

  • పాకిస్థాన్‌లో ఘ‌ట‌న‌
  • క‌త్తెర‌కు ప‌దును లేద‌ని కోపం
  • పాక్ మంత్రిపై నెటిజ‌న్ల సెటైర్లు
  Pakistan ministers ribbon cutting in unusual style leaves netizens in splits

ఓ దుకాణాన్ని ప్రారంభించ‌డానికి వెళ్లిన ఓ పాకిస్థాన్ మంత్రి రిబ్బ‌న్‌ను క‌త్తెర‌తో కాకుండా పళ్ల‌తో కొరికిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. పాక్ మంత్రి తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా లాహోర్‌లో కొత్త‌గా నిర్మించిన ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి పాక్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ వెళ్లారు.

దుకాణ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద క‌ట్టిన‌ రిబ్బన్ ను ఆయ‌న క‌ట్ చేసి లోప‌లికి వెళ్లాల్సి ఉంది. దాని కోసం నిర్వాహ‌కులు క‌త్తెర కూడా తీసుకొచ్చారు. అయితే, ఆ క‌త్తెర‌ పదునుగా లేదు. ఎంత‌గా ట్రై చేసినా అది క‌ట్ కాలేదు.  దీంతో ఆ మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. షాపు యజమానిని తిట్టుకుంటూ ప‌ళ్ల‌తోనే రిబ్బ‌న్ ను పరపరా క‌ట్ చేసిపారేశారు. అది చూసి, అక్క‌డున్న వారు మాత్రం న‌వ్వు ఆపుకోలేక‌పోయారు. మరోపక్క, ఆయ‌న తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

More Telugu News