Chiranjeevi: రెండు పాటల కోసం రెడీ అవుతున్న 'ఆచార్య'

  • 'ఆచార్య' టాకీ పార్టు పూర్తి
  • రెండు పాటలు బ్యాలెన్స్ 
  • ఈ నెలలోనే చిత్రీకరణ 
  • రెజీనా ఐటమ్ ప్రత్యేక ఆకర్షణ
Acharya shooting will completes soon

'ఆచార్య' సినిమా ఎట్టకేలకు టాకీ పార్టును పూర్తిచేసుకుంది. కరోనా కారణంగా అనేక అవాంతరాలను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లిన ఈ సినిమా, రెండు పాటలు మినహా టాకీ పార్టును పూర్తి చేసుకుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. దాంతో ఈ రెండు పాటల చిత్రీకరణ ఎప్పుడు పూర్తవుతుందా అనే ఆసక్తి తలెత్తడం సహజం.

ఈ రెండు పాటలు ఎవరి కాంబినేషన్ కి సంబంధించినవి అనే విషయంలో క్లారిటీ లేదుగానీ, ఈ నెలలోనే వాటిని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకూ ఒక పాటను, 26 నుంచి 31వ తేదీ వరకూ మరో పాటను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అంటే ఈ సినిమా షూటింగు పార్టు ఈ నెలలోనే పూర్తికానుందన్న మాట.

అక్రమార్కులపై పోరాటానికి ఒక నిజాయతీపరుడు ఎత్తిన అవతారమే 'ఆచార్య'. సందేశంతో పాటు వినోదం పాళ్లు పుష్కలంగా ఉన్న సినిమా ఇది. కాజల్ కథానాయికగా అలరించనుండగా, ప్రత్యేక పాత్రలో చరణ్ - పూజ హెగ్డే కనిపించనున్నారు. ఇక రెజీనా ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

More Telugu News