Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా భారీ నష్టాలే

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
నిన్న భారీ నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను కొనసాగించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తదితర కంపెనీల షేర్లు ఒత్తిడికి గురికావడం మార్కెట్లపై ప్రభావం చూపింది.

దీంతో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు నష్టపోయి 52,198కి పడిపోయింది. నిఫ్టీ 120 పాయింట్లు పతనమై 15,632 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (5.59%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.82%), బజాజ్ ఆటో (0.95%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.85%), మారుతి సుజుకి (0.68%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.40%), టాటా స్టీల్ (-2.75%), భారతి ఎయిర్ టెల్ (-2.48%), ఎన్టీపీసీ (-2.43%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.28%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News