Eatala Rajendar: నాడు నోరు మూసుకుని ఉండుంటే నేడు నా పదవి ఎక్కడికీ పోయేది కాదు: ఈటల

  • మరోసారి టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన ఈటల
  • టికెట్ ఇచ్చినవాళ్లే ఓడించాలని చూశారని ఆరోపణ
  • ఇంటిపై పోలీసులతో దాడి చేయించారని వెల్లడి
  • ఓ దశలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయినట్టు వివరణ
Eatala once again fires in TRS leaders

హుజూరాబాద్ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నేతలపై మరోసారి ధ్వజమెత్తారు. టికెట్ ఇచ్చిన వాళ్లే నన్ను ఓడించాలని చూశారని విమర్శించారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ నా ఇంటిపై పోలీసులతో దాడి చేయించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఎందుకని భావించానని ఈటల వెల్లడించారు. గుట్టలు, ఉపయోగంలేని భూములు, రైతుబంధు... భూస్వాములకు ఇవ్వొద్దని చెప్పానని తెలిపారు. నాడు నోరు మూసుకుని ఉండుంటే నేడు తన పదవి ఎక్కడికీ పోయేది కాదని అన్నారు.

More Telugu News