Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 193 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 61 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ టాటా స్టీల్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, టాటా స్టీల్ వంటి కంపెనీల షేర్లు పుంజుకోవడంతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 53,054కి చేరుకుంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 15,879కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.38%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.03%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.48%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.42%), నెస్లే ఇండియా (1.26%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-2.12%), మారుతి సుజుకి (-0.81%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.74%), బజాజ్ ఫైనాన్స్ (-0.15%), టెక్ మహీంద్రా (-0.15%).

More Telugu News