కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువకుడి ఆత్మహత్య బాధాకరం: నారా లోకేశ్
- నిరుద్యోగి బలవన్మరణం అంటూ వార్త
- స్పందించిన లోకేశ్
- జగన్ హామీ నిలుపుకోలేదని వ్యాఖ్యలు
- నిరుద్యోగులు నిరుత్సాహం వీడాలని పిలుపు
- ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టీకరణ
బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సాధించాలనే కలలు కల్లలయ్యానే మనస్తాపంతో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గోపాలనగరం గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని లోకేశ్ వివరించారు. నిరుద్యోగ యువకుడి ఆత్మహత్య బాధాకరమని, అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు.
నిరుద్యోగులారా నిరుత్సాహం వద్దు, కలిసి పోరాడదాం అని లోకేశ్ పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కానేకాదని స్పష్టం చేశారు.