Sensex: ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్.. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఏడు సెషన్లుగా కొనసాగిన ర్యాలీకి ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయినప్పటికీ... ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 2 పాయంట్ల నష్టంతో 51,934కి చేరింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 15,574 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (3.52%), బజాజ్ ఫైనాన్స్ (2.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.97%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.01%), బజాజ్ ఆటో (0.97%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.80%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.63%), ఏసియన్ పెయింట్స్ (-1.51%), యాక్సిస్ బ్యాంక్ (-0.69%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.65%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News