pooja chopra: గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నా కారుని వెంబడించి ఇంటికి వ‌చ్చేశారు: హీరోయిన్ పూజాచోప్రా

  • భ‌యాన‌క అనుభ‌వం ఎదురైంది
  • త‌లుపు కొట్టి పిలిచారు
  • తీశాక ఆటోగ్రాఫ్, సెల్ఫీ అడిగారు
  • వారిని పంపించి, సీసీటీవీ ఫుటేజీ చూశాను  
pooja chopra shares about bitter experience

త‌న‌కు ఎదురైన ఓ భ‌యాన‌క అనుభ‌వాన్ని సినీ హీరోయిన్ పూజాచోప్రా ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రించి చెప్పింది. రెండు నెలల క్రితం ఇద్దరు వ్యక్తులు తన కారుని వెంబడించారని తెలిపింది. అంతే కాకుండా త‌న ఇంటికి వ‌చ్చి తలుపు కొట్టి పిలిచారని చెప్పింది. త‌లుపు తీశాక ఆటోగ్రాఫ్, సెల్ఫీ అడిగార‌ని వివ‌రించింది.

తాను అప్పుడే ఓ కొత్త అపార్ట్‌మెంట్‌లో ఇల్లు తీసుకున్నానని,  ఆ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ కళ్లుగప్పి ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించార‌ని చెప్పింది. తలుపు తీసి వారిని చూసి షాక్ అయ్యాన‌ని తెలిపింది. వాళ్లని చూడ‌గానే భయపడ్డానని తెలిపింది. ఆ స‌మ‌యంలో త‌న ఇంట్లో ఉన్న ఇద్దరు స్నేహితులు .. ఆ గుర్తు తెలియ‌ని వ్యక్తులను ఆరా తీశార‌ని, మీరు ఎవ‌రని అడిగార‌ని చెప్పింది.

అనంత‌రం వాళ్లని అక్కడి నుంచి పంపించివేశారని వివ‌రించింది. ఆ త‌ర్వాత తన‌ సెక్యూరిటీకి ఫోన్‌ చేసి, బయటవాళ్లు అపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చారని ప్ర‌శ్నించాన‌ని చెప్పింది.  సీసీ ఫుటేజీ పరిశీలించి చూస్తే వాళ్లిద్దరూ బైక్‌పై త‌న కారుని ఫాలో అవుతూ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారని తెలిసిందని తెలిపింది. దీంతో తాను చాలా భ‌య‌ప‌డ్డాన‌ని చెప్పారు.

More Telugu News