Fire Accident: తిరుమల అగ్నిప్రమాదం వెనుక అసలు కారణం ఇదే!

  • గత మంగళవారం తిరుమలలో అగ్నిప్రమాదం
  • ఒకరి సజీవదహనం.. 20 దుకాణాలు దగ్ధం
  • ఆత్మహత్యేనంటున్న పోలీసులు
  • పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో మంటలు!
Police identifies reason behind fire accident in Tirumala

తిరుమలలో గత మంగళవారం ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణ సముదాయంలో అగ్నిప్రమాదం జరిగి మలిరెడ్డి అనే వ్యక్తి సజీవ దహనం కావడం తెలిసిందే. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని భావించినా, పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశం వెల్లడైంది. మలిరెడ్డి ఆత్మహత్య చేసుకునే క్రమంలోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని గుర్తించారు. మలిరెడ్డి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 20 దుకాణాలు దగ్ధమయ్యాయని తాజాగా వెల్లడైంది.

కాగా, ఆత్మహత్యకు ముందు మలిరెడ్డి తన మొబైల్ ఫోన్, పర్సును మరో దుకాణంలో ఉంచాడు. ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు మలిరెడ్డి భార్య శోభ సాయంతో ఫోన్ లాక్ తీయించారు. ఆ ఫోన్ లో మలిరెడ్డి సెల్ఫీ వీడియో ఉందని తెలుస్తోంది. ఆ సెల్ఫీ వీడియో ద్వారా మలిరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

More Telugu News