Corona Virus: దేశంలో మ‌రో 3.82 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ‌

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 2,06,65,148
  • మృతుల సంఖ్య 2,26,188
  • 16,04,94,188 మందికి వ్యాక్సిన్లు  
  • మొత్తం 29,48,52,078 కరోనా పరీక్షలు  
 Media Bulletin on status of positive cases COVID19 in india

భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. నిన్న‌ కొత్త‌గా 3,82,315  మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,38,439  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 2,06,65,148కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,780 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,26,188 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,51,731 మంది కోలుకున్నారు. 34,87,229 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,04,94,188 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 29,48,52,078 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,41,299 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News