Andhra Pradesh: ఏపీలో మరో 11,698 కరోనా పాజిటివ్ కేసులు, 37 మరణాలు

  • ఏపీలో ఉద్ధృతంగా కరోనా సెకండ్ వేవ్
  • గత 24 గంటల్లో 50,972 కరోనా పరీక్షలు
  • శ్రీకాకుళం జిల్లాలో 1,641 పాజిటివ్ కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 4,421 మంది
  • ఇంకా 81,471 మందికి చికిత్స
AP witnesses corona second wave

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 50,972 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,698 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 1,641 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు (1,581), చిత్తూరు (1,306), అనంతపురం (1,066) జిల్లాల్లోనూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,421 మంది కరోనా నుంచి కోలుకోగా, 37 మంది మృత్యువాత పడ్డారు.

ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926కి పెరిగింది. 9,31,839 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 81,471 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,616కి చేరింది.

More Telugu News