New Delhi: ఆగ్రహంతో త‌ల్లిని చెంప‌పై కొట్టిన కుమారుడు.. అక్క‌డిక‌క్క‌డే మృతి.. వీడియో ఇదిగో!

  • ఢిల్లీలోని ద్వార‌క ప్రాంతంలో ఘ‌ట‌న‌
  • పొరుగింటి వారి వాహ‌నాల పార్కింగ్ విష‌యంలో గొడ‌వ‌
  • సీసీటీవీ కెమెరాలో ఘటన రికార్డు
 Elderly woman dies after being slapped by son in Delhis Dwarka

త‌ల్లితో రోడ్డుపై గొడ‌వప‌డ్డాడు.. ఆగ్ర‌హంతో ఊగిపోయాడు.. త‌న‌ను కని, పెంచిన త‌ల్లి అన్న విచ‌క్ష‌ణ కూడా లేకుండా గ‌ట్టిగా చెంప‌దెబ్బ కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు కింద‌ప‌డిపోయి, అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని ద్వార‌క ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన దృశ్యం అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌యింది. అవ‌తార్ కౌర్ (76) అనే వృద్ధురాలు త‌మ ఇంటి వ‌ద్ద పొరుగింటి వారి వాహ‌నాల పార్కింగ్ విష‌యంలో త‌న కొడుకు, కోడ‌లితో మాట్లాడుతోంది. ఈ స‌మ‌యంలోనే వారి మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఈ నేప‌థ్యంలో ఆమె మాట్లాడుతుండ‌గానే కొడుకు ర‌ణ్‌బీర్ ఒక్క‌సారిగా ఆమెను చెంప‌దెబ్బ కొట్టాడు. ఆమె అక్క‌డే ప‌డిపోగా కోడ‌లు ఆమెను పైకి లేపే ప్ర‌య‌త్నం చేసింది. ఆమె స్పృహ‌కోల్పోయింద‌ని భావించి వారు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, వృద్ధురాలు అప్ప‌టికే చ‌నిపోయింద‌ని వైద్యులు నిర్ధారించారు.

దీంతో  ఆమె కొడుకు ర‌ణ్‌బీఐర్‌పై  పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమె త‌న కుమారుడు, కోడ‌లితో మాట్లాడ‌డానికి ముందే పొరుగింటి వారితో పార్కింగ్ విష‌యంలో గొడ‌వ పెట్టుకుంద‌ని పోలీసులు చెప్పారు. ఈ విష‌యంలోనే ఆమెతో కుమారుడు వాదించాడ‌ని పోలీసులు త‌మ విచార‌ణ‌లో తేల్చారు.

More Telugu News