Samineni Udayabhanu: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వాళ్లు కొనకపోతే ప్రభుత్వమే కొనే ప్రయత్నం చేస్తుంది: చీఫ్ విప్ సామినేని

  • విశాఖ ఉక్కు పరిశ్రమ అంశంపై సామినేని స్పందన
  • ప్లాంట్ ను మూతపడనివ్వబోమని స్పష్టీకరణ
  • కడప ప్లాంట్ కంటే విశాఖ ప్లాంట్ కే జగన్ ప్రాధాన్యమిస్తున్నారు 
  • ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళతామన్న సామినేని
Samineni Udayabhanu says AP Govt will buy Vizag Steel Plant if private sector does not buy

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఏపీ ప్రభుత్వ వైఖరిని చీఫ్ విప్ సామినేని ఉదయభాను వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ మూతపడనివ్వబోమని స్పష్టం చేశారు. ప్రైవేటు వాళ్లు కొనకపోతే ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వమే కొనే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కే సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలని సామినేని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో అఖిలపక్ష నేతలను ప్రధాని వద్దకు తీసుకెళతామని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విపక్షాలు వైసీపీతో కలిసిరావాలని కోరారు.

More Telugu News