Sensex: ఈ వారాన్ని భారీ నష్టాల్లో ముగించిన మార్కెట్లు

sensex loses 434 points
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 434 పాయింట్లు కోల్పోయి 50,889కి పడిపోయింది. నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 14,981 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.97%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.56%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.46%), ఎన్టీపీసీ (0.87%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.73%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-5.06%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.77%), యాక్సిస్ బ్యాంక్ (-3.48%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.20%), బజాజ్ ఆటో (-2.72%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News