ఆ పని ఇప్పుడు తెలుగుదేశం చేసింది: నారా లోకేశ్
- స్థానిక ఎన్నికలకు మేనిఫెస్టో ఏంటి అని కొందరంటున్నారు
- ఇన్నాళ్లూ పల్లెల అభివృద్ధికి ప్రణాళికా తీసుకురాలేక పోయారు
- తెలుగుదేశం అభ్యర్థులను గెలిపిస్తే పల్లె ప్రగతి
- అందుకే పంచ సూత్రాలను రూపొందించాం
'పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలకు మేనిఫెస్టో ఏంటి అని కొందరు మాట్లాడుతున్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లలో పల్లెల అభివృద్ధికి అంటూ ఏ ప్రణాళికా తీసుకురాలేక పోయారు. ఆ పని ఇప్పుడు తెలుగుదేశం చేసింది' అని నారా లోకేశ్ తెలిపారు
'తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపిస్తే పల్లె ప్రగతి ఏ రకంగా సాధ్యం చేసి చూపిస్తారో చెప్పే ప్రణాళిక ఇది. పల్లె ప్రగతికి పంచ సూత్రాలను రూపొందించడం జరిగింది' అని నారా లోకేశ్ తెలిపారు. పంచ సూత్రాలను తెలుపుతూ రూపొందించిన వివరాల జాబితాను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు.