ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ... ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేమన్న హైకోర్టు
- ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధం
- ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఎన్నికల నిలిపివేతకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్
- ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టే సాధ్యం కాదన్న న్యాయస్థానం
- కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎస్ఈసీకి ఆదేశాలు
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేమని తేల్చి చెప్పింది. అటు, అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఎస్ఈసీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.