maharastra: మహారాష్ట్రలో 50 అడుగుల వంతెన పై నుంచి పడ్డ మినీ బస్సు.. ఐదుగురి మృతి

  • మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘటన
  • పూణె-బెంగళూరు హైవేపై ఘటన
  • మృతుల్లో ముగ్గురు పురుషులు, మహిళ, చిన్నారి
  • ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు
accident in maharastra

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 50 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి ఓ మినీ బస్సు పడడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని పోలీసులు వివరించారు.

ఆ బస్సు ముంబై నుంచి గోవా వెళుతోన్న సమయంలో పూణె-బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. వంతెన పై నుంచి వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు దూసుకుపోయి కింద పడిపోయిందని వివరించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయాలపాలైన వారిని సహాయక బృందాల వారు ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.

More Telugu News