Andhra Pradesh: లారీ, రెండు కార్లు ఢీ.. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల సజీవ దహనం

  • ఓవర్ టేక్ చేస్తుండగా టిప్పర్‌ను ఢీకొట్టిన వైనం
  • ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు కార్లు, టిప్పర్ దహనం
  • సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
4 red sandal smugglers burnt alive in a road accident held in kadapa

కడప శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవ దహనమయ్యారు. కడప శివారులోని గోటూరు వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే  ప్రయత్నంలో ఓ సుమో వాహనం వేగంగా వెళ్లి టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు కార్లు, టిప్పర్ దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో ఎర్రచందనం తరలిస్తున్న వాహనంలో ఉన్న నలుగురు స్మగ్లర్లు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News