Secunderabad: బ్రేకింగ్... సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం వద్ద భారీ పేలుడు!

  • ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు
  • చెత్తను తొలగిస్తుండగా ఘటన
  • ఆందోళనకు గురైన స్థానికులు
Blast Near Secunderabad Temple

సికింద్రాబాద్ లో ఉన్న ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఈ ఉదయం జరిగిన ఓ పేలుడుతో తీవ్ర కలకలం రేగింది. ఆలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో వ్యర్థాలను తొలగించేందుకు వచ్చిన ఓ వ్యక్తి, దానిలో కనిపించిన పెయింట్ డబ్బాను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, భారీ శబ్దంతో అది పేలింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలు అయ్యాయి.

విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పేలింది ఓ టిన్నర్ డబ్బా అని ప్రాథమికంగా తేల్చారు. దసరా పండగ నాడు ఈ ఘటన జరగడంతో, ఆలయంలోని భక్తులతో పాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News