వరద బాధితుల కష్టాలు వింటుంటే ప్రభుత్వం ఉండీ ఏంటి ప్రయోజనం అనిపించింది: నారా లోకేశ్
- ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తిన వరదలు
- తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన లోకేశ్
- రైతులకు పరామర్శ
అనంతరం సుద్దగడ్డ వాగు ఉద్ధృతి కారణంగా నీటమునిగి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అక్కడి రైతులను పరామర్శించారు. లోకేశ్ అక్కడ్నించి పిఠాపురం మీదుగా ఉప్పాడ చేరుకున్నారు. సూరాడపేటలో సముద్ర కోతకు గురై ఇళ్లు కోల్పోయిన మత్స్యకారులను పరామర్శించారు. తన పర్యటనపై ట్విట్టర్ లో పోస్టు చేసిన ఆయన... ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు పాలకులు ముఖం చాటేస్తే బాధితులు ఏమైపోవాలని ప్రశ్నించారు. కాగా, లోకేశ్ పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి.