Sensex: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా కేసులు... 24 గంటల్లో 68 మంది మృతి!

10175 new Corona cases in AP
  • 24 గంటల్లో 10,175 కొత్త కేసులు
  • 5,37,687కి పెరిగిన మొత్తం కేసులు
  • 4,702 మంది మృతి
ఏపీలో కరోనా కేసులకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ప్రతి రోజు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 10,175 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 1,412 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,386 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,37,687కి పెరిగింది. ఇదే సమయంలో గత 24 గంటల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,702 మంది కరోనా బారిన పడి చనిపోయారు. గత 24 గంటల్లో 72,229 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
Sensex
Nifty
Stock Market

More Telugu News