Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 273 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 83 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 6 శాతానికి పైగా పెరిగిన భారతి ఎయిర్ టెల్
Stock Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 38,901కి పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 11,470 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ స్టాకుల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (6.38%), బజాజ్ ఫైనాన్స్ (4.42%), ఏసియన్ పెయింట్స్ (3.93%), టాటా స్టీల్ (3.82%), ఎన్టీపీసీ (3.52%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-3.29%), యాక్సిస్ బ్యాంక్ (-2.23%), టెక్ మహీంద్రా (-1.75%), ఇన్ఫోసిస్ (-1.53%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.99%).

More Telugu News