Uttar Pradesh: మహిళతో పాటు ఆమె స్నేహితుడికి గుండు కొట్టించి.. చెప్పులదండ వేసి ఊరేగించిన వైనం!

  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • ఇద్దరి మధ్య స్నేహం నచ్చక బంధువుల చర్య
  • స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించిన స్థానికులు
Woman Man Shamed Paraded In UP Village Residents Filmed It

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళతో పాటు ఆమె స్నేహితుడిని కొందరు హింసించారు. బంధువులే ఆమెను ఇలా వేధించినట్లు తెలుస్తోంది. కన్నౌజ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఓ మహిళ (37) భర్త రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె స్నేహితుడైన ఓ దివ్యాంగుడు (40) ఆమెకు పలు విషయాల్లో సాయం చేసేవాడు. అయితే, వారిద్దరి మధ్య ఉన్న స్నేహంపై ఆమె బంధువులు అభ్యంతరాలు చెప్పేవారు.

ఈ నేపథ్యంలో వారిద్దరు గ్రామంలోని ఓ ప్రాంతంలో బంధువుల కంటపడ్డారు. దీంతో బంధువులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరికి గుండు చేయించి, ముఖానికి నల్ల రంగు పూసి, చెప్పుల దండలు వేసి గ్రామంలో వారిని ఊరేగించారు.

వారి వెనుక చాలా మంది ఉండడం వీడియోలో కనపడుతోంది. ఈ కేసులో బాధితురాలి బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

More Telugu News