Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex ends 230 points high
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన సూచీలు... ట్రేడింగ్ చివర్లో లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 39,074కి చేరుకుంది. నిఫ్టీ 77 పాయింట్లు లాభపడి 11,550 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.99%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.79%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.50%), యాక్సిస్ బ్యాంక్ (2.49%), బజాజ్ ఆటో (2.25%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.86%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.10%), ఏసియన్ పెయింట్స్ (-1.42%), మారుతి సుజుకి (-1.28%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.05%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News