Sensex: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 45 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 6 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్
Stock markets ends with slight profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్లు లాభపడి 38,844కి పెరిగింది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 11,472 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (4.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.28%), టెక్ మహీంద్రా (2.21%), ఏసియన్ పెయింట్స్ (1.92%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.62%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.61%), సన్ ఫార్మా (-1.55%), నెస్లే ఇండియా (-1.48%), టాటా స్టీల్ (-1.26%), ఎల్ అండ్ టీ (-1.13%).

More Telugu News