Sensex: మధ్యాహ్నం తర్వాత లాభాలను కోల్పోయిన మార్కెట్లు

Sensex ends 86 points higher
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లన్నీ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో మన ఇన్వెస్టర్లు కూడా హుషారుగా ట్రేడింగ్ జరిపారు. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో సెన్సెక్స్ 180 పాయింట్ల వరకు పెరిగింది. అయితే, మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో లాభాలు హరించుకుపోయాయి.

ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 38,615 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,408 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.97%), భారతి ఎయిర్ టెల్ (1.77%), మారుతి సుజుకి (1.46%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.34%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.04%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-1.42%), ఓఎన్జీసీ (-1.36%), నెస్లే ఇండియా (-1.21%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.89%), ఇన్ఫోసిస్ (-0.81%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News