మంగళగిరి నియోజకవర్గం జర్నలిస్టులకు ఉచిత బీమా ప్రకటించిన నారా లోకేశ్
- 62 మంది జర్నలిస్టులకు బీమా వర్తింపు
- ప్రీమియం చెల్లించిన లోకేశ్
- రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ బీమా చేయించాలని డిమాండ్
కరోనా మరణాలకు కూడా బీమా వర్తింపజేసేలా తీసుకువచ్చిన ఈ పాలసీలకు ప్రీమియంను నారా లోకేశ్ చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం బీమా చేయించాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని అన్నారు.