Andhra Pradesh: సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ వద్దకు పంపిన ఏపీ ప్రభుత్వం

  • రాజ్ భవన్ కు చేరిన మూడు రాజధానుల బిల్లు
  • గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ
  • ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ విమర్శలు
AP Govt sends 3 capitals bill to Governor

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే కనుక మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఓవైపు కరోనా కేసులు అమాంతం పెరిగిపోతుంటే... రాజధానుల విషయం ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నిస్తున్నాయి.

More Telugu News