Sensex: నేడు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends 409 points high
  • 409 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 108 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతం వరకు పుంజుకున్న బజాజ్ ఫైనాన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 409 పాయింట్లు పెరిగి 36,738కి చేరుకుంది. నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 10,813కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (3.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.72%),  టాటా స్టీల్ (3.05%), హెచ్డీఎఫ్సీ (3.04%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.25%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-1.29%), టెక్ మహీంద్రా (-1.27%), హీరో మోటో కార్ప్ (-0.68%), టీసీఎస్ (0.60%), హిందుస్థాన్ యూని లీవర్ (-0.45%).
Sensex
Nifty
Stock Market

More Telugu News