Sensex: కొనసాగుతున్న ర్యాలీ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 466 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 156 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Sensex closes 466 points high

దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు ర్యాలీ కొనసాగింది. ఈరోజు మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 466 పాయింట్లు లాభపడి 36,487కి పెరిగింది. నిఫ్టీ 156 పాయింట్లు పుంజుకుని 10,764 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (7.58%), బజాజ్ ఫైనాన్స్ (6.04%),  రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.57%), మారుతి సుజుకి (3.24%), టీసీఎస్ (2.91%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో(-1.29%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.90%), భారతి ఎయిర్ టెల్ (-0.79%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.48%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.17%).

More Telugu News