raghuramakarishnaraju: కొత్త జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలి: జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

  • గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు 
  • ఇప్పుడు సీఎం జగన్ అధికారికంగా ప్రకటన చేయాలి
  • కొత్త జిల్లాకు ఆ పేరు పెడితే ప్రజలు సంతోషపడతారు
raghurama krishnam raju writes letter to  jagan

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. ఈ మేరకు జగన్‌కు ఆయన రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఆయన క్యారాలయం ఈ రోజు విడుదల చేసింది.  

గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్‌ ఆ సమయంలో ఈ విషయంపై ప్రజలకు హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ విషయంపై ఇప్పుడు సీఎం జగన్ అధికారికంగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. కొత్త జిల్లాకు ఆ పేరు పెడితే ప్రజలు సంతోషపడతారని చెప్పారు.

More Telugu News