Vasireddy Padma: అయ్యన్నపాత్రుడ్ని వెనకేసుకొచ్చిన లోకేశ్ ఈ కేసులో బాధపడడం హాస్యాస్పదం: వాసిరెడ్డి పద్మ

  • నెల్లూరు జిల్లా టూరిజం విభాగంలో మహిళపై అధికారి దాడి
  • మహిళా ఉద్యోగినిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
  • చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఎస్పీకి ఆదేశాలందాయని వెల్లడి
Vasireddy Padma visits Nellore tourism department contract employ

నెల్లూరు జిల్లా టూరిజం విభాగం  కార్యాలయంలో ఉషారాణి అనే కాంట్రాక్ట్ ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఓ దివ్యాంగురాలు అని కూడా చూడకుండా అత్యంత హేయంగా కొట్టాడు. ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. నెల్లూరు వచ్చి బాధితురాలిని పరామర్శించారు. ఏడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. అయ్యన్నపాత్రుడ్ని వెనకేసుకొచ్చిన లోకేశ్ ఈ కేసులో బాధపడడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఓ మహిళా మున్సిపల్ కమిషనర్ ను అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News