Sensex: రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 329 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 94 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతం వరకు పుంజుకున్న ఇన్ఫోసిస్
Sensex closes 329 points high

దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈ వారాన్ని మార్కెట్లు లాభాలతో ముగించాయి. జులై ఎఫ్ అండ్ ఓ సిరీస్ ప్రారంభమైన నేపథ్యంలో లాభాలతో ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 35,171కి పెరిగింది. నిఫ్టీ 94 పాయింట్లు పుంజుకుని 10,383 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (6.94%), టీసీఎస్ (5.21%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.64%), ఓఎన్జీసీ (2.87%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.59%).

టాప్ లూజర్స్:
ఐటీసీ (-3.54%), బజాజ్ ఫైనాన్స్ (-3.33%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.00%), సన్ ఫార్మా (-1.58%),  టైటాన్ కంపెనీ (-1.10%)

More Telugu News