అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించిన దళిత యువకుడిపై అమానుష దాడి.. మృతి!

lover killed in maharashtra
  • మహారాష్ట్రలోని పుణెలో ఘటన
  • యువకుడిపై ఉమ్మివేసి, రాళ్లు, రాడ్లతో దాడి
  • రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన యువకుడు
  • యువకుడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
అగ్రవర్ణ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావంటూ ఓ దళిత యువకుడిపై అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. అతడిని చావబాదడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన దళిత యువకుడు విరాజ్‌ విలాస్‌ జాగ్తాప్‌(20) ఓ అమ్మాయిని ప్రేమించాడు.

దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల వారు ఆ యువకుడికి ఫోన్‌ చేసి మాట్లాడాలని పిలిపించారు. దీంతో అతడు వారి ఇంటికి వెళ్లాడు. కులం పేరుతో అతడిని తిడుతూ అవమానించడంతో అతడు అక్కడ నుంచి బయటకు వచ్చి బైక్‌పై వెళ్లాడు.

అయితే, మధ్యలో ఆ యువకుడిని అమ్మాయి తరఫు బంధువులు ఆరుగురు అడ్డుకుని టెంపోతో దాడి చేశారు. దీంతో విరాజ్‌ బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. ఆ యువకుడి ముఖంపై ఉమ్మి వేస్తూ, రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న విరాజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Go Back to Shorts
Maharashtra
Crime News

More Telugu News