కరోనా మహా విలయం... చైనానే దాటేసిన మహారాష్ట్ర!

Maharashtra Beats China in New Cases
  • ఒక్కరోజులో 3 వేలకు పైగా కేసులు
  • చైనాతో పోలిస్తే మహారాష్ట్రలో అధిక కేసులు
  • రెండున్నర లక్షలను దాటేసిన మొత్తం కేసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబయి సహా మహారాష్ట్ర అంతటా, కరోనా మహమ్మారి విలయాన్ని సృష్టిస్తోంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 3,007 కొత్త కేసులు నమోదు కాగా, కేసుల సంఖ్య విషయంలో చైనాను దాటేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 85,975కి చేరుకోగా, 3 వేల మందికి పైగా మరణించారు.

చైనాలో అధికారిక లెక్కల ప్రకారం ఇంతవరకూ 83,036 కేసులు నమోదయ్యాయన్న సంగతి తెలిసిందే. ఇక దేశం మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య రెండున్నర లక్షలను దాటేసింది. మహారాష్ట్ర తరువాత కేసుల విషయంలో తమిళనాడు, ఢిల్లీ ముందు నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే 50 శాతానికి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.
Go Back to Shorts
India
Corona Virus
Maharashtra
China
New Cases

More Telugu News