jonnavithula ramalingeswara rao: సినీ గేయ రచయిత జొన్నవిత్తులపై అట్రాసిటీ కేసు నమోదు

  • అంటరానితనాన్ని కొనసాగించాలనే ఉద్దేశం వచ్చేలా పద్యం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
  • న్యాయ నిపుణుల సూచన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయన్న పోలీసులు
Atrocity Case filed against Song writer Jonnavithula

సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. మార్చి 23న ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న జొన్నవిత్తుల ఎస్సీ, ఎస్టీల మనోభావాలు కించపరిచేలా ఓ పద్యం పాడారని, అంటరానితనాన్ని కొనసాగించాలనే అర్థం ఆ పద్యంలో ఉందని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన పాడిన పద్యాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజునే ఓ యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయ నిపుణుల సలహాల అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

More Telugu News