Sensex: ఇన్వెస్టర్లకు భరోసా ఇవ్వలేని ప్యాకేజీ... భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 885 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 240 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Sensex ends 885 points lower

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. దేశ ఆర్థిక స్థితిని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా ఇన్వెస్టర్లలో పూర్తి భరోసాను కల్పించలేకపోయింది. ఈ ప్యాకేజీ మన ఆర్థిక పరిస్థితిని ఎప్పటికి గట్టెక్కిస్తుందనే సందేహాలు ఇన్వెస్టర్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు అమ్మకాలకే మొగ్గుచూపడంతో... సూచీలు నష్టాల బాట పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 885 పాయింట్లు నష్టపోయి 31,122కి పడిపోయింది. నిఫ్టీ 240 పాయింట్లు కోల్పోయి 9,142కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటో కార్ప్ (2.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.65%), మారుతి సుజుకి (1.48%), ఎల్ అండ్ టీ (0.96%), సన్ ఫార్మా (0.78%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-5.24%), ఇన్ఫోసిస్ (-5.16%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-4.69%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.46%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-4.07%).

More Telugu News