Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. 6 శాతానికి పైగా పతనమైన రిలయన్స్

  • 190 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 42 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా పతనమైన రిలయన్స్ ఇండస్ట్రీస్
Sensex ends 190 points lower

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో మార్కెట్లు నిరాశాజనకంగా ట్రేడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 31,371కి పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 9,196 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (5.71%), భారతి ఎయిర్ టెల్ (4.39%), ఐటీసీ (4.13%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.96%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.86%),    

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-6.12%), ఏసియన్ పెయింట్స్ (-2.93%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.51%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.88%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.62%).

More Telugu News