Iqbal: నాడు ‘ఎల్జీ పాలిమర్స్’ విస్తరణకు అనుమతులిచ్చింది చంద్రబాబే : వైసీపీ నేత ఇక్బాల్

  • విశాఖ ప్రజల భావోద్వేగాలను బాబు రెచ్చగొడుతున్నారు
  • ఈ పరిశ్రమపై చిన్న కేసులు పెట్టారనడం తగదు
  • కమిటీ నివేదికలు రాగానే ఆ మేరకు ఎఫ్ఐఆర్ 
YSRCP Leader Iqbal criticises TDP

విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేత మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశలో ఉన్న తరుణంలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు, టీడీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విస్తరణకు అనమతులు ఇచ్చింది చంద్రబాబేనని విమర్శించారు. ఈ పరిశ్రమపై చిన్న కేసులు పెట్టారంటూ బాబు విమర్శలు చేయడం తగదని, ఈ ఘటనకు సంబంధించిన కమిటీ నివేదికలు రాగానే ఆ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే విషయం బాబుకు తెలియందేమీ కాదని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కమిటీ సమస్యలు సృష్టించి, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News